అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏపీలోని గ్రామాల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటలకు తగ్గకుండా విద్యుత్ కోత లతో పాటు,అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. పవర్ హాలీడే అనేది పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమని అన్నారు. ఫోన్ వెలుతురులో ప్రసవాలు చేయాల్సి రావడం దారుణ పరిస్థితికి అద్దం పడుతుందని అన్నారు. దీంతో 36 లక్షల మంది కార్మికుల ఉపాధికి దెబ్బ ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఏపీ లో వైసీపీ పాలన అధ్వాన్నంగా మారుతుందని, రాష్ట్రంలో అభివృద్ధికి శాశ్వతంగా హాలిడే ప్రకటించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్ హాలిడేలతో జగన్ పాలన కొనసాగుతుందని ఎద్దేవ చేశారు.