అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నటుడు,రచయిత పోసాని కృష్ణమురళి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 లో జరిగిన ఎన్నికల నాటి నుంచి వైసీపీ పార్టీ కి మద్దతుదారుడిగా ఉంటూ పోసాని కృష్ణ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.
పలు సినిమాల్లో హీరోగా, కమెడీయన్గా, విలన్గా నటించిన పోసాని గతంలో టీడీపీలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం వైసీపీకి మద్దతుదారుడిగా మారారు. కాగా మరో విలక్షణ హాస్యనటుడు అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుడిగా నియమించిన రెండురోజుల్లోనే పోసాని కృష్ణమురళిని చైర్మన్గా నియమించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.