అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడ పోలీసులు పలు ఆంక్షలు
విధించారు. రేపు ( శుక్రవారం) రాత్రి వేడుకలకు అనుమతి లేదని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణా టాటా వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకే ఇండోర్ వేడుకలకు అనుమతి ఇస్తామని , వేడుకలల్లో సామర్థ్యానికి మించి ఎక్కువ మందికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అర్దరాత్రి రోడ్లపై ఎవరూ తిరగకూడదని హెచ్చరించారు.
బందరు, ఏలూరు, బీఆర్టీస్ రోడ్లు, పై వంతెనలు మూసివేస్తున్నామని పేర్కొన్నారు. ముందు జాగ్రర్త చర్యగా విజయవాడ నగరం 15 చోట్ల డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నామని వెల్లడించారు. మద్యం మత్తులో గాని క్షణికావేశంలో గాని చేసిన తప్పులను పునరావృతం కాకుండా , 2022ను కూడా బాధాకరంగా మార్చుకోవద్దని యువతకు సీపీ సూచించారు.