అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం ప్రారంభమైంది. ఈ మేరకు విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ను నిషేధించడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తిరుమల స్ఫూర్తి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
2027 నాటికి ప్లాస్టిక్ పొల్యూషన్ రహిత రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షించారు. విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందని వివరించారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ను సముద్రం తీరం నుంచి తొలగించారని తెలిపారు . ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని అన్నారు. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశాం తెలిపారు.