అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి(100) పల్నాడు జిల్లా మాచర్లలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అనారోగ్యంతో రాత్రి మాచర్లలోని తన కుమారుడు నరసింహం ఇంటిలో మృతి చెందారు. గత ఏడాది ఏపీ సీఎం జగన్ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితోపాటు కుటుంబ సభ్యులను సన్మానించి రూ.75 లక్షలను అందించారు.
వచ్చే నెల 2న పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సీతామహాలక్ష్మిని ఢిల్లీ తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె మృతి చెందింది. మధ్యాహ్నం 3 గంటలకు మాచర్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అధికార లాంఛనాలతో పింగళి సీతామహాలక్ష్మి పార్ధివదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆమె మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.