అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి పట్టుబడ్డారు. ఓ యాక్సిడెంట్ కేసులో ఖాసిం అనే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సై తోపాటు ఇతర పోలీసు సిబ్బందిపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.