ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు.
అరెస్టు నుంచి రక్షణ కల్పించాలి
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు.
ఈ మేరకు గురువారం అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసులో సీబీఐ శుక్రవారం తనను విచారిస్తే సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం ఆ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని, అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరుపనున్నారు.