అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత పక్షం రోజులుగా థియేటర్లపై దాడుల పర్వానికి ఫుల్స్టాప్ పడింది. ఏపీలోని సినిమా థియేటర్ల యజమానులకు ఊరట కలిగించేలా తీపి కబురు అందించింది. ఇప్పటివరకు సీజ్ చేసిన తొమ్మిది జిల్లాలోని 83 థియేటర్లకు తిరిగి ప్రారంభించేందుకు అనుమతిని జారీ చేసింది. అయితే నెల రోజుల్లో థియేటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. అనుమతుల కోసం జాయింట్ కలెక్టర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్నినాని సూచించారు.