అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) అన్నారు. శ్రీరామనవమి( Srirama navami ) సందర్శంగా ఎక్స్(ట్విటర్) వేదిక ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం, శ్రీరాముడి ఆదర్శాల గురించి ప్రజలు చర్చించుకోవడం గర్వకారణమని అన్నారు. ఏపీలో కూడా సుభిక్ష, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం పాలన రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.
ఓటమి భయంతో టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలు
ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో అధికార వైసీపీ(YCP) ఓటమి భయంతో టీడీపీ నాయకులపై దాడులు, అరెస్టులు చేయించేందుకు కుట్రలు చేస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇటీవల ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం జగన్పై జరిగిన రాయి దాడి ఘటన భద్రత వైఫల్యానికి కారణమైన అధికారులను విచారణ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈసీ పర్యవేక్షణలోనే వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
ఈ కేసులో టీడీపీ సీనియర్నాయకుడు బొండా ఉమ(Bonda Uma) ను ఇరికించేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిని సారించాలని కోరారు.