అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను సమర్ధవంతంగా ఆదుకుంటుంటే చంద్రబాబు అబద్దాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఇవాళ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్న వారిలో ఒకడైన పవన్కల్యాణ్ కులాల పేరిట రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేసేందుకు ప్రయత్ని్స్తున్నాడని దుయ్యబట్టారు.
టీడీపీ హయాంలో వచ్చిన హుద్హుద్ తుఫాన్లో నష్టపోయిన బాధితులను ఆదుకున్నామని చంద్రబాబు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవాలు లేవని అన్నారు. నాడు ప్రజలకు పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు పంచారని విమర్వించారు. తమ హయాంలో విపత్తు వస్తే బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నామని అన్నారు.
వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నామని జగన్ పేర్కొన్నారు. అబద్దాలు, మోసాలతో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని జగన్ తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు.