అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని కోరుతూ ఈనెల 12న జనసేన అధినేత పవన్కల్యాణ్ నిరాహారదీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేపట్టనున్న దీక్షలో పార్టీకి చెందిన నాయకులు పాల్గొననున్నారు.
విశాఖను పరిరక్షించాలని కార్మికులు, ప్లాంట్ నిర్వాహకులు గత మూడు వందల రోజులుగా ఆందోళన చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. విశాఖ పరిశ్రమను రక్షించాలని కోరుతూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.