అమరావతి : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మూడు వందల రోజులుగా కార్మికులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆదివారం ఒకరోజు దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 5గంటల వరకు ఆయన దీక్షలో పాల్గొననున్నారు. విశాక ఉక్కు కర్మాగారం కార్మికుల్లో మరింత స్ఫూర్తి నింపేందుకు దీక్షను చేపడుతున్నామని జనసేన నాయకులు వెల్లడించారు.
కాగా గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వద్ద పారపట్టి కంకరను గుంతలో వేసి శ్రమదానం చేశారు. ఏపీ జగన్ సర్కార్ హయాంలో రోడ్ల దుస్థితి అధ్వన్నంగా తయారయిందని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ పవన్ కల్యాణ్ శ్రమదానంలో రోడ్లపై గుంతలు పూడ్చారని తెలిపారు.