అమరావతి : చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించని జనసేన అధినేత పవన్కల్యాణ్కు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan ) ఆరోపించారు. వైసీపీ హయాంలో ఎక్కడా అవినీతి జరుగకున్నా అవినీతి(Corruption) జరిగిందని ఆరోపించడం అవివేకమని పేర్కొన్నారు. కాకినాడలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి లేఖ రాసినా పవన్ కల్యాణ్(Pawan Kalyan) చంద్రబాబు అవినీతిపై ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చి వారి హయాంలో పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని విమర్శించారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కుట్ర రాజకీయాలకు పాల్పడనున్నదని కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా లంచాలు లేవని, వివక్ష అంతకంటే లేదని స్పష్టం చేశారు.