అమరావతి : జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) కాకినాడ (Kakinada) పార్లమెంట్ అభ్యర్థి పేరును ప్రకటించారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తంగేళ్ల ఉదయ్ను (Uday)అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి వెల్లడించారు. మంగళవారం పిఠాపురానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని అన్నారు. తనను పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఎక్కువ మంది కోరారని తెలిపారు. ఇక్కడి నుంచే రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి నన్ను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోనే పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేద్దామని, పిఠాపురంలో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు పెంచుతామని అన్నారు. వ్యవస్థపై ఉన్న కోపంతో ప్రజలు నోటాకు ఓట్లు వేయవద్దని కోరారు.