తిరుమల : శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామిజీ శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ జలసీమగా మారిందని, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో అనేక మంది ఆకలితో అలమటిస్తూన్నారని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రతి ఒక్కరు తమవంతు సాయం అందించాలని కోరారు.