అమరావతి : తెలంగాణ(Telangana)లో పదో తరగతి పేపర్ల లీక్(Papers Leakage) వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ(AP Minister Botsa) స్పందించారు. పరీక్షా పత్రాల లీక్కు పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు(Student future) నాశనం చేయడం దౌర్భాగ్యమని వెల్లడించారు.
ఏపీలో పదో తరగతి(Tenth Exams) పరీక్షలు పటిష్టంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. గతేడాది పేపర్ లీక్కు పాల్పడిన 75 మందిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ ఏడాది పేపర్ లీక్ కాకుండా పటిష్ట చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు.