తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రేపు ఉదయం 11.52 గంటలకు పంచమీ తీర్థం(చక్రస్నానం) ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆలయం వద్ద ఉన్నవాహన మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అర్చకులు.
బ్రహ్మోత్సవాల మరుసటి రోజూ డిసెంబరు 9వ తేదీ గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణముఖ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.