అమరావతి : ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మరోసారి ప్రతిపక్ష నేతలపై సెటైర్లు వేశారు. మంగళవారం మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విరుచుకుపడ్డారు. నారా లోకేశ్(Nara Lokesh) పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి అని అపశకునలే ఎదురయ్యాయని ఆరోపించారు.
కుప్పంలో యాత్ర మొదలు పెట్టగానే నందమూరి తారకరత్న మృతి చెందారని పేర్కొన్నారు. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే అర్ధం కావడం లేదని విమర్శించారు. కనీసం పాదయాత్ర సభలో ఏం మాట్లాడాలో తెలియడం లేదని అన్నారు. కొడుకు కోసం చంద్రబాబు, అల్లుడు కోసం బాలకృష్ణ నానా తంటాలు పడుతూ పనన్ కల్యాణ్ సహకారం తీసుకుంటున్కారని ఆరోపించారు. ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.