అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు ఆర్టీఏ అధికారులు అతిప్రవర్తనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ఒంగోలులో పర్యటిస్తున్న సందర్భంగా ఆర్టీఏ అధికారులు సీఎం కాన్వాయ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడంపై సీఎం కార్యాలయం స్పందించింది. ఒంగోలులో నిన్న తిరుపతి వెళ్లే ప్రయాణికుడి కారు స్వాధీనం ఘటనపై సర్వత్ర విమర్శలు రావడంతో ఈ విషయంపై సీఎం జగన్ అధికారుల ప్రవర్తన తీరుపై మండిపడ్డారు.
సంబంధిత సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులకు ఆదేశించారు. దీంతో పూర్తి సమాచారం సేకరించిన అనంతరం వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్కు పోలీసుల నుంచి సమాచారం అందింది. కాగా ఈ సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సీఎం వస్తే దుకాణాలు మూసేయడం, కాన్వాయ్ కోసం కారు లాక్కెళ్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని వాఖ్యనించారు.