అమరావతి : శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. పది గేట్లను 15 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3,78,000 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 3,52,000 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 884.80 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది . పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలకు గాను 214.36 టీఎంసీలుగా నమోదైంది.
కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 62,170 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఔట్ఫ్లో 4.26 లక్షల క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి దిగువకు 3.99 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. 13,14 గేట్ల ద్వారా 32,516 వేల క్యూసెక్కులు పెన్నానదికి విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమశిలకు 23,459 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది .