అమరావతి : ఏపీకి అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజ్యాంగం అమలు చేసిన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నెల్లూరు జిల్లాలోని రాజుపాలెంలో అంబేద్కర్, జగ్జీవన్రామ్కు నివాళులర్పించి రైతులు యాత్ర ప్రారంభించారు. తమకు రాజ్యాంగబద్ధంగా న్యాయం జరగాలని నినాదాలు చేశారు.
సీఎం జగన్ తన మనస్సును మార్చుకుని రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి పరిరక్షణ ఐక్యకార్యచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి జనసేన పార్టీకి చెందిన నాయకులు మద్దతు తెలిపారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతోపాటు జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.