తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సమాచారం లేక తిరుమలకు చేరుకున్న భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. శుక్రవారమే సర్వదర్శనం టికెట్ల కోసం ఆన్లైన్లో టోకెన్లను జారీ చేశారు. మంగళవారం వరకు సర్వదర్శనం టికెట్లను జారీ చేశారు. తిరిగి బుధవారం నాటి టికెట్లను మంగళవారం నాడు తిరుపతిలోని కౌంటర్ల ద్వారా జారీ చేయనున్నారు.
కాగా నిన్న తిరుమలలోని శ్రీవారిని 66, 593 మంది భక్తులు దర్శించుకోగా 31, 206 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ. 3.79 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.