అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్లో (Andhra pradesh) కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా మరో కేసు నమోదయింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరాయి. బాధిత మహిళ యూఏఈ నుంచి బెంగళూరు మీదుగా రాష్ట్రానికి వచ్చిందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని ప్రకటించింది. ఆమెతో సన్నిహితంగా మెలిగిన 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ పాజిటివ్ రాలేదని వెల్లడించింది.