అమరావతి : ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల రెండో విడత పనులను వేగవంతం చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇవాళ విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ డిస్ప్లేలు లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని, వీటి భద్రతకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్మార్ట్ బోధన సదుపాయాల వల్ల పిల్లలకూ, ఉపాధ్యాయులకూ మేలు జరుగుతుందని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆలోచన చేయాలని పేర్కొన్నారు. టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలని జగన్ వివరించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్లపైనా సీఎం సమీక్షించారు.