తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఈనెల 12న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళతో తిరుమంజనం నిర్వహించి, సింధూరంతో విశేష అలంకరణ చేస్తామని వారు తెలిపారు.