అమరావతి: ప్రకాశం జిల్లా దర్శి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని జముకుల దిన్నె గ్రామంలో పాత ఇల్లు మిద్దె కూలి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. రేణుక(7), స్వాతి(5) అనే చిన్నారులు పాత ఇంట్లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా మిద్దెకూలి అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు చిన్నారుల మరణంతో కుటుంబ సభ్యుల్లో విషాదచాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.