తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా (Ex-officio member) దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ(TTD) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం , శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.