తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్అఫీషియో సభ్యుని(Ex-officio member )గా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ శనివారం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ జేఈవో(Ttd JEO) వీరబ్రహ్మం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కమిషనర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. సత్యనారాయణకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను జేఈవో అందించారు. ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఆలయ పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.