అమరావతి : ఏపీలో తెలుగుదేశం బతికి బట్టకట్టాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చురుకుగా రాజకీయాల్లో కి రావాల్సిందేనని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన స్వార్థం కోసం చంద్రబాబు చేసేవన్నీ డ్రామాలేనని, అతడిని రాష్ట్ర ప్రజలుఎవరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎందుకు పనికి రాని వ్యక్తని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వచ్చే బడ్జెట్లో ప్రవేశ పెడతామని ఆయన వివరించారు. టీడీపీ హయాంలో రూ.70వేల కోట్ల అప్పును ప్రజలపై మోపారని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని త్వరలోనే గాడిలో పెడతామని, ఉద్యోగులందరికీ పీఆర్సీని త్వరలోనే అమలు చేస్తామని ఆయన అన్నారు.