అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవుడి మన్యాలను లీజ్కు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ లీజులో వ్యవసాయేతర భూములను మినహాయిస్తున్నారు. రాష్ట్రంలో నమోదైన కంపెనీలకు ప్రాధాన్యతనిస్తూ దేవాదాయ శాఖ పరిధిలోని భూములను లీజుకు తీసుకునే అగ్రిమెంట్లోని లీజు నిబంధనలను ఈ నోటిఫికేషన్లో సవరించారు. ప్రజలు తమ అభ్యంతరాలను 30 రోజుల్లో అందజేయాలని ప్రభుత్వం సూచించింది.
ఈ నోటిఫికేషన్లలో పేర్కొన్న నిబంధన అమలులోకి వస్తే, రాష్ట్రంలోని దేవాలయాలతో ఏదైనా లీజు ఒప్పందాన్ని చేసుకునే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పన్నులు చెల్లించినట్లు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న వాణిజ్య భూములను సక్రమంగా వినియోగించుకునేందుకు, పారదర్శకంగా వాటిని లీజుకు ఇవ్వాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లోని ఎండోమెంట్స్ భూములు సక్రమంగా వినియోగించని వాటిని ప్రభుత్వం గుర్తించింది. వీటిని పారదర్శకంగా దీర్ఘకాలికంగా లీజుకు ఇవ్వనున్నది.