అమరావతి : ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ అభ్యర్థుల ( Rajya Sabha Candidates ) స్థానాలకు టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం టీడీపీ తరుఫున సానా సతీశ్( Sana Satish ), భాష్యం రామకృష్ణ ( Rama Krishna ), చింతకాయల విజయ్ ( Vijay ) అసెంబ్లీలో రెండేసి చొప్పున నామినేషన్లు వేశారు.
అంతకు ముందు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. జనసేన సభ్యర్థి లింగమనేని రమేశ్ గత శుక్రవారమే నామినేషన్ వేశారు. దాదాపుగా నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ,బీజేపీ, జనసేన నాయకులు పాల్గొని అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.