హైదరాబాద్: వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ ఏపీ) విశ్వవిద్యాలయ 2021 సంవత్సర స్నాతకోత్సవాన్ని గురువారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు జరగునున్న ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవానికి 2019 నోబుల్ ప్రైజ్ అవార్డు గ్రహీత అమెరికాలోని బింగటన్, యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం స్టాన్లీ విట్టింగ్హామ్, మైక్రోసాఫ్ట్ ఇండియా డైరెక్టర్ మయూరికా సింగ్, వీఐటీ ఏపీ వ్యవస్థాపకులు, చాన్స్లర్ డాక్టర్ జీ విశ్వనాథన్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన మహత్మాగాంధీ బ్లాక్, రాక్ప్లాజా, నీలం సంజీవరెడ్డిబ్లాక్, సవిత్రిబాయిపూలే బ్లాక్లను సైతం ప్రారంభించనున్నారు.