తిరుమల : తిరుపతి, తిరుమలలో అధికారుల నిర్వాకం వల్ల మహారాష్ట్రలో తలెత్తిన వివాదాన్ని సరిదిద్దేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. తిరుమలలో ఛత్రపతి శివాజీ బొమ్మపై ఎలాంటి నిషేధం లేదని టీటీడీ వెల్లడించింది . వారం క్రితం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అత్యుత్సాహం కారణంగా అలిపిరి దగ్గర మహారాష్ట్ర భక్తుల వాహనంపై శివాజీ బొమ్మను తొలగించారు.
దీంతో మహారాష్ట్రలో విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిం చాలనే ఉద్దేశంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బోర్డు సభ్యుడు మిలిందా నర్వేకర్ శివాజీ విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ బొమ్మపై ఎలాంటి నిషేధం లేదని ప్రకటించారు.