అమరావతి : కరోనా పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టేక్కించేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వారం రోజుల పాటు కరోనా కేసుల సంఖ్య 10వేల మార్కును దాటి నిన్న 5వేలకు తగ్గడంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నైట్ కర్ఫ్యూను పొడగించడం వల్ల కరోనా కేసులు మరింత తగ్గే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.