అమరావతి : మావోయిస్టులకు నిధులు సమీకరిస్తున్నారని బిహార్లో నమోదైన కేసు ఆదారంగా ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు ఈరోజు నెల్లూరు జిల్లాలో సోదాలు నిర్వహించారు. కేసు విచారణలో భాగంగా ఏపీ, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్లోని 26 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిందితుల నుంచి 3తుపాకులు , బోర్ రైఫిల్,59 బుల్లెట్లు, డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు, 4 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.