అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 73,341 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,746 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారినపడిన వారిలో 1,648 మంది కోలుకున్నారు. 20 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 19,90,656కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 19,58,275 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 18,766 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,615కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.