అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1433 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1815 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇవాళ్టివరకు మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102కు పెరిగింది. వీరిలో మొత్తం 19,67,472 మంది కోలుకున్నారు. ఇంకా 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 13686కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 68,041 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.