అమరావతి: ఏపీలో జులై 1నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త జీతాలు ఇచ్చేందుకు అక్కడి సర్కారు సిద్ధమైంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జూన్ 30నాటికి ఆ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. వారికి జులై 1నాటికి కొత్త జీతాలు అందజేయాలని తెలిపారు. మిగిలిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.