అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ప్రముఖుల పేర్లను పెట్టాలని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్, శ్రీకృష్ణదేవారాయలు, బాలయోగి పేర్లు పెట్టాలని ఆయన ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖను రాశారు. ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పునకు శ్రీకారం చుట్టినందుకు సీఎంను అభినందించారు.
అయితే గోదావరి జిల్లాలో ఏదో ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. మరో జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయలవారి పేరు పెట్టాలని, కోనసీమకు లోక్ సభ స్పీకర్ బాలయోగి పేరును పెట్టాలని విన్నవించారు.