అమరావతి : పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఏపీ పీఆర్సీ సాధన సమితి నాయకులు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన విధంగానే తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు బండి శ్రీనివాసరావు, వెంకట్రాంరెడ్డి స్పష్టం చేశారు. ‘ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు చర్చలకు వెళ్లాం, చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్లు పదేపదే చెప్పాం. ఈ రోజు భేటీలోనూ పాత అంశాలపైనే మాట్లాడారు. మేం చెప్పిన మూడు అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం. సాధ్యపడదని మంత్రులు చెప్పారు. ఇక తమకు ఆందోళనే శర్యణమని వారు పేర్కొన్నారు.
అయితే ఉద్యోగుల ఉద్యమం సందర్భంగా ఉద్యోగులను భయపెట్టే చర్యలకు పాల్పడవద్దని వారు కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలని సూచించారు. ఈనెల 3న చలో విజయవాడను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.