అమరావతి : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద స్నానానికి దిగిన ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కొండపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు ఇవాళ స్నానానికి వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్సిబ్బంది తక్షణమే స్పందించి ఐదుగురు విద్యార్థులను కాపాడగా మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.