అమరావతి : రెడ్ బుక్ పేరుతో అధికారులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(Nara Lokesh) బెదిరిస్తున్నారన్న కేసుపై ఏసీబీ కోర్టు (ACB court) లో జరిగిన విచారణ వాయిదా పడింది. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకునేందుకు పేర్లను రెడ్బుక్( Red book) లో నమోదు చేసుకుంటున్నామని నారా లోకేశ్ అనేక సభలు, సమావేశాల్లో వెల్లడించారు. దీంతో కొందరు అధికారులు, ఉద్యోగులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ(CID) లోకేశ్కు నోటీసు జారీచేసింది. నారా లోకేష్ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. రెడ్ బుక్లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్లో పేర్కొంది. ఈ కేసును పరిశీలించిన ఏసీబీ కోర్టు ఈ నెల 21వ తేదీకి విచారణను వాయిదా వేసింది.