Nandyal SP : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26వ తేదీన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి హెలిపాడ్ సెంటర్ వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సుమారుగా 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.
శ్రీశైల పర్యటనలో ముర్ము భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకోనున్నారు. అనంతరం టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లో రూ.43.08 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టు పనులను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అంతేకాదు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ఆమె సందర్శించనున్నారు.