Roja | సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ప్రక్షాళనపై పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా సెల్వమణి ఫిర్యాదుతో నగరి వైసీపీ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్చేశారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కె.జె.కుమార్, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కె.జె.శాంతి, వీరి కుటుంబ సభ్యులు పార్టీకి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఇటీవల జగన్కు ఫిర్యాదు చేశారు. వారిపై అభియోగాలు వాస్తవమని ధృవీకరిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు పార్టీ నుంచి తొలగిస్తున్నామని వైసీపీ అధిష్ఠానం తెలిపింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ఇకపై వారి కార్యక్రమాలకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ కె.ఆర్.జె భరత్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Ycp