Nadenla on YS Jagan | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తీరు మాగ్జిమం కరప్షన్ మినిమం సీఎంగా ఉందని అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో జరిగిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలతో పాలన సాగుతున్నదని ఆరోపించారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఓటీఎస్ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు.
అధికారులకు లక్ష్యాలు విధించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు. అమరావతి కోసం చిన్న సన్నకారు రైతులు తమ భూములను త్యాగం చేస్తే సీఎం జగన్ వారిని అవమానించి రోడ్డుకు లాగారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జమీందార్ల పాలన కొనసాగుతున్నదన్నారు.