అమరావతి : లంచాలు తీసుకుంటూ ప్రజలను వేధిస్తున్న ఉద్యోగులపై ఫిర్యాదుల పరంపర కొనసాగు తుండడంతో ఏసీబీ అధికారులు వరుసదాడులు చేస్తూ ఉద్యోగులను రెడ్ హ్యండెడ్గా పడ్టుకుంటున్నారు. ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆస్తిపన్ను వేసేందుకు ఓ బాధితుడి నుంచి మున్సిపల్ ఆర్ఐ షపీవుల్లా రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఆస్తిపన్ను వేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేయగా అందుకు బాధితుడు రూ. 15వేలు అందజేస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడ్డ ఆర్ఐ షపీవుల్లాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.