అమరావతి : నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణరాజు(MP Raghurama Raju) వైసీపీకి రాజీనామా చేయనున్నారు. తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో వెల్లడిస్తానని, వైసీపీకి రాజీనామా చేయడం పక్కా అని తెలిపారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెం టీడీపీ(TDP) , జనసేన(Janasena) సభలో పాల్గొంటానని పేర్కొన్నారు. కూటమి తరఫునే లోక్సభ(Lokesabha)కు పోటీ చేస్తానని అన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలోనే చెబుతానని వెల్లడించారు.
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. కొద్ది నెలలకే వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) తో విభేదాలు తలెత్తడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి దూరంగా ఉంటూ జగన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై బహిరంగ ఆరోపణలు చేస్తూవస్తున్నారు. దీంతో తమ సభ్యుడు, ఎంపీ రఘురామ రాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ అధిష్టానం కేంద్రాన్ని కోరుతూ వచ్చింది.
సభ్యత్వం పోతే తనను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీస్తారన్న భయంతో పరోక్షంగా కేంద్రానికి మద్దతు తెలిపిన రఘురామ రాజుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీకి దూరంగా ఉంటూ జగన్, ప్రభుత్వంపై విరుచుకు పడుతూ అనునిత్యం వార్తలో నిలుస్తున్నారు.
మరో రెండు నెలల్లో తిరిగి పార్లమెంట్కు ఎన్నికలు జరుగనుండడంతో వైసీపీకి రాజీనామా చేసి తన రాజకీయ భవిష్యత్ను సుస్థిరం చేసుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఏపీలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి దగ్గరగా ఉంటున్న రఘురామ రాజు టీడీపీలో చేరే అవకాశాలున్నాయి.