అమరావతి : తనపై సీఐడీ కేసులు కొట్టివేయాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్కు ఏపీ హైకోర్టు షరత్లతో కూడిన విచారణకు అనుమతిఇచ్చింది. రాజద్రోహం మినహా ఇతర కేసులు సీఐడీ విచారించవచ్చని స్పష్టం చేసింది. తనపై వేసిన రాజద్రోహంతో పాటు సీఐడీ నమోదు చేసిన ఇతర సెక్షన్లను రద్దు చేయాలని రఘురామ హైకోర్టు ను ఆశ్రయించారు.
రెండు సమూహాల మధ్య విధ్వేశాలను రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేసారని సీఐడీ అతడిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై రఘురామ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇవాళ విచారించిన కోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్హౌస్లో న్యాయవాది సమక్షంలోనే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే రఘురామను విచారించాలని సీబీఐకి ఆదేశించింది.