అమరావతి: కాఫీ బోర్డు సభ్యురాలిగా వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మాధవితోపాటు మరో ఎంపీ ప్రతాప్ సింహ, రాజ్యసభ సభ్యుడు ఎన్ చంద్రశేఖరన్ కూడా బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. కాఫీ బోర్డును మళ్లీ నియమిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. గొడ్డేటి మాధవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, విశాఖపట్నం జిల్లా దోమంగికి చెందిన విశ్వనాథం, కొత్తపాడేరుకు చెందిన కురుస ఉమామహేశ్వరరావు, విశాఖ జిల్లా కిన్నెర్లకు చెందిన జయతు ప్రభాకర్రావు, హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీశాంత్ తక్షణ క్యాటగిరీలో ఉన్నారు. కాఫీ ఉత్పత్తిదారులను వాణిజ్య శాఖ సభ్యులుగా నియమిస్తున్నట్లు కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొన్నది.