అమరావతి : గుంటూరు జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ కుటుంబంలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. తెనాలి మండలం కొలకలూరులో తల్లి వసుంధర, కుమారుడు కిరణ్, కోడలు యామని నిన్న పురుగుల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన వీరిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో తల్లి, కొడుకు ఇవాళ చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మరణించగా కోడలు పరిస్థితి విషమంగా ఉంది.